ఈనాడు దిగజారుతున్నదా ??
ఏమి మీకు ఇంకా సందేహమా అని అడుగుతారేమో ??
నాకు ఊహ తెలిసినప్పటినుంచి దినపత్రిక రంగంలొ సంచలనాలు రేపుతూ , జర్నలిజంని క్రొత్తపుంతలు తొక్కించి ఆంధ్రావనిలో ఎదిగి ప్రక్క రాష్త్రాలకి కూడ విస్తరించిన ఈ దిగ్గజం ఇప్పుడు కేవలం "రామో"జికీయం గా మారుతుంది।
కేవలం రాజశేఖర రెడ్డి తో వచ్చిన విభేధాలతో శ్రుతి , గతి తప్పుతుంది.
ఇంతవరకు ఎవరకి అవసరం లేనివి , తెలియనవి వెలికితీసి మరీ మొదటి పేజీలో వేస్తున్నారు। అంత అన్యాయం జరుగుతుంటే ఇంత వరకూ నిద్రపోతున్నరా?? లేకపోతే అవసరం రాలేదా??
చివరికి వెర్రిమొహాళ్ళగ రాష్ట్రమంతా ప్రతీరోజూ పత్రిక కొనుక్కోని మరీ, సీరియల్ లాగా వాళ్ళిద్దరి తగువులు చదవాల్సిన
గతి పట్టింది। ఎలాగు ఆ విభేధాలు ఇంతలోగా తేలవు గాని జిల్లా ఎడిషన్ లాగ దీనికి ఒక ఎడిషన్ మొదలుపెడితే సరి। అది ప్రక్కన పడేసి మిగత వార్తలేమిటొ చదువుకోవచ్చు।
ऑनलाइन లో చదవటానికి ఇంత చిరాగ్గావు వుంది। పాపం రోజు కొనుక్కొని చదివే వాళ్ళగతి ఏమిటో ??
అసలు పత్రికా రంగంలో గట్టి పోటి లేక ఈ దుర్గతి।



