గత కాలం నాటి కవిత - 2
మనసు ఉల్లాసంగా వున్నప్పుడు మదిలో ఏవో భావాలు మెదిలి, నాలిక మీద కదులుతున్న నాలుగు పదాలను కుదురుగా కూర్చి ప్రాస పూతను పూస్తే మంచి కవితగా మారుతుందని నా అనుభవం , అభిప్రాయం।
అయితే ఈ క్రింద వుంచనున్న నాలుగు పంక్తులు ఏ వర్గం లోనికి వస్తుందో తెలియదు , అసలు తన మనస్సుకి స్పృసించిన సందర్భంలో కవిగారికి ఆ ఆలోచన వచ్చే ప్రసక్తే లేదనుకొండి।
ఇక విషయానికి వస్తే , మా నాన్నగారు తన చిన్నప్పుడు రచించి ప్రచురితమైన కొన్ని కవితలని భ్లాగులో వుంచే ప్రయత్నంలో అడిగితే తను చెప్పిన నాలుగు మాటలు॥
అవి 1950సం,, వారి గ్రామంలో రెండు ఏళ్ళుగా వర్షాలు , పంటలు లేక చాలా కుటుంబాలకి తిండి కూడ కరువైందట. వీళ్ళ ఇంటిలో వండిన అన్నం గంజి కోసం చాలా మంది కాసుకొని వుండే వారట..
కొన్ని ప్రాంతాలకి రంగూన్ నుంచి తెప్పించిన ఎరుపు బియ్యం లభించేదట॥ అక్రమాల వలన అవి కూడ అందరికి అందేవి కాదట। ఆ పరిస్థితులలో తనకి ఆవేదనతో కదిలిన భావాలు నాలుగు పంక్తులలో॥


